జగ్గయ్యపేట వద్ద రూ. 7 కోట్ల బంగారం పట్టివేత

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని పూలపాడు వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  వాహనంలో భారీ ఎత్తున తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు వాహన డ్రైవర్ను విచారించారు. స్వాధీనం చేసుకున్న బంగారం ప్రముఖ నగద సంస్థ మలబార్ గోల్డ్కు చెందినదని తెలిపారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా భారీ ఎత్తున బంగారం తరలింపుపై పోలీసులు విచారణ చేపట్టారు.