జనం సాక్షి కథనానికి స్పందన కార్యదర్శిపై విచారణ చేపట్టిన అధికారులు
డోర్నకల్ సెప్టెంబర్ 11 జనం సాక్షి
గ్రామ అభివృద్ధికి పాటుపడాల్సిన కార్యదర్శి ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ఆధార్ కార్డు నుంచి ఆసరా పెన్షన్ వరకు డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో శనివారం అక్కడి ప్రజలు కార్యదర్శిని నిలదీశారు.దీంతో జనంసాక్షి పత్రికలో “గ్రామ కార్యదర్శిని నిలదీసిన ప్రజలు”అనే ప్రత్యేక శీర్షిక ప్రచురించింది.శీర్షికకు స్పందించిన జిల్లా అధికారి విచారణకు ఆదేశించారు.ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ఎంపీఓ మున్వర్ బేగ్ క్షేత్రస్థాయి అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు.ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వెల్లడించారు.