జనగామలో కారు-బైక్ ఢీ:ఇద్దరి మృతి

వరంగల్: జిల్లాలోని జనగామలో కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ పరారయ్యాడు.