జనగామ డీఎస్పీ సురేందర్‌ ఇళ్లపై ఏసీబీ దాడులు

p3j46t8wవరంగల్ :

వరంగల్ జిల్లా జనగామ డీఎస్పీ సురేందర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. హన్మకొండ, నర్సంపేట, జనగామ, హైదరాబాద్‌లో గల ఇళ్లలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ అ సోదాలు చేపట్టారు.దీంతోపాటుగా డీఎస్పీ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు తమ సోదాలను కొనసాగిస్తున్నారు.