జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు..

` జవాను మృతి..!
శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌ లో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ సైనికుడు మరణించగా.. ఆర్మీ మేజర్‌ సహా నలుగురు గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని మన సైన్యం మట్టుబెట్టింది.శనివారం తెల్లవారుజామున మచల్‌ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్‌ పోస్ట్‌ వైపు వెళ్తున్నవారిని భద్రతా దళాలు పసిగట్టాయి. దీంతో వారిని ప్రశ్నించేలోపే.. పాక్‌ ఆర్మీకి చెందిన బ్యాట్‌ (ఖజీసతిబబిజీని ఃనీతీటవతీ ంఞబితినీని ువజీఎ) స్క్వాడ్‌ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ఆర్మీ మేజర్‌ సహా నలుగురు భారత సైనికులు తీవ్రంగా గాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిసింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది.