జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వై ప్రభాకర్

జహీరాబాద్ ఆగస్టు 21( జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల నిరంతరం పోరాడుతామని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని తవకల్ ఫంక్షన్ హాల్ లో టిడబ్ల్యూజేఎఫ్ జహీరాబాద్ డివిజన్ ద్వితీయ మహాసభలు జరిగాయి.ఈ మహా సభలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వాటి సాధన కోసం అవసరమైతే బహిరంగంగా పోరాటాలు కూడా చేయడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి అన్నారు. అక్రిడేషన్ వల్ల కేవలం బస్ పాస్ తప్ప దేనికి రాకుండా దేనికి పనికి రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు 20 లక్షల ఎగ్జిబిషన్ ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహా సభ లో పలు సమస్యల పైన తీర్మానాలు చేసి వాటి సాధన కోసం ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు అందజేయడమే కాకుండా అవసరమైతే పోరాటాలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీ డబ్బులు జేయఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి, కోశాధికారి అశోక్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రాయకోటి నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు మణికొండ బస్వరాజ్, పబ్బతి సంతోష్ కుమార్, నియోజకవర్గ నాయకులు మహబూబ్, శ్రీనివాస్ శాస్త్రి, రోషన్, ముజాహిద్,ప్రశాంత్, బాబు రావు, రాజు స్వామి, మహా రుద్రయ్య స్వామి, బంటు పురుషోత్తం, అశోక్, చందు, రవి, శ్రీనివాస్, మల్లన్న, కలిమ్,కరిమ్, జలీల్,బక్కన్న, సంగమేశ్వర్, సత్తా ర్, తదితరులు పాల్గొన్నారు.