జర్నలిస్టు లకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరబాబు అధ్వర్యంలో సన్మానం.,.

గద్వాల రూరల్ జులై  13 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా నుంచి చాలామంది జర్నలిస్టులు పాల్గొన్నారు..వారికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరబాబు అధ్వర్యంలో జర్నలిస్టు లను శాలువా తో సన్మనిచడం జరిగింది.. డిసిసి అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ
కారోనా కాలంలో భయపడకుండా ప్రజలకి సేవ చేసిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థ ఎందుకంటే వీళ్ళు స్వచ్ఛందంగా జీవితం ఉండని వ్యవస్థలో ఉండి అలాంటి పరిస్థితులు కూడా ప్రాణాలకి త్యాగంగా పెట్టి ప్రజలకి మంచి సందేశాలు కరోనా కలాం లో జరిగిన జాగ్రత్త చర్యలు వివరించి ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తలు సూచించారు.వీరు బాబు గారు మాట్లాడుతూ
కరోనా కాలంలో చాలామంది విలేకరులు కూడా వాళ్ళ పనిలో నిమగ్నం అయి కరొన బారిన పడి కొంత మంది విలేకరులు కూడా ప్రాణాలు కూడా వదిలినారు. ఇలాంటి వాళ్ల కోసం ఈ సన్మానం అనేది చాలా తక్కువనే నా ఉద్దేశంలో మీరు కష్టపడినా దానికి దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థలు ఇంతమంది ఒక కార్యక్రమానికి రావడం అంటే నా మీద మీ ప్రేమ అభిప్రాయాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరునా ధన్యవాదములు తెలుచుకుంటున్నాను..ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మాజీ సీనియర్ కౌన్సిలర్ శంకర్ , టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్ అన్నా, సర్పంచ్ గీత నాయుడు,సేవాదళ్ జిల్లా చీఫ్ ఆర్గనైజర్ మరియు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ షేక్ జమల్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర, జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రెటరీ శివరాజ్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇలియాస్,ప్రకాష్ యోన, రాము జహంగీర్,రాజేష్,అంజి తదితరులు ఉన్నారు