*జర్నలిస్ట్ జమీర్ కుటుంబాన్ని ఆదుకోవాలి*

-కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం,ఎక్స్ గ్రేషియా అందించాలి
-అదనపు కలెక్టర్ మొతిలాల్ కు జర్నలిస్టుల వినతి…
నాగర్ కర్నూల్ రూరల్:జులై 16(జనంసాక్షి)
విధి నిర్వహణలో భాగంగా వరదలో చిక్కుకున్న బాధితుల వార్త సేకరణకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన జగిత్యాల జిల్లా ఎన్ టీవీ జర్నలిస్ట్ మహమ్మద్ జమీర్ ను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని నాగర్ కర్నూల్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శనివారం అదనపు కలెక్టర్ మొతిలాల్ కు వినతి పత్రం అందించారు.జమీర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటిని మంజూరు చేయాలని,అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆ వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్న లిస్టులు అబ్దుల్లా ఖాన్,కందికొండ మోహన్,జెమిని సురేష్,దినకర్రావు,సురేష్ రావు,సాయిలు సాగర్,అహ్మదుల్లా ఖాన్ లతోపాటు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు విజయ్,కొండకింద.మాధవరెడ్డి,ఏటిగడ్డ.వెంకటేష్,ప్రదీప్ కుమార్,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area