జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పాదయాత్ర

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి)
జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఉద్యమ నాయకులు ఢిల్లీ వసంత్ అన్నారు. జయహో జహీరాబాద్ అనే నినాదంతో పాదయాత్ర చేపట్టారు. ముందుగా స్వర్గీయ మాజీమంత్రి మొహమ్మద్ ఫరీదుద్దీన్ సమాధికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఈద్గా, మెథొడిస్ట్ చర్చ్ లలో ప్రత్యేక ప్రార్థనలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఢిల్లీ వసంత్ మాట్లాడుతూ. జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ వసంత్ బృందం సభ్యులు జనార్ధన్, బిల్లీ పురం మాధవరెడ్డి, భూమన్ స్టీవెన్సన్ బెంజమిన్, మధుగొండ్ల శ్రీనివాస్, జాన్సన్, ప్రజాసంఘాల నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.