జహీరాబాద్ కోర్టు కాంప్లెక్స్ లో వాక్సినేషన్ క్యాంపు

cజులై 26 (జనంసాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శేషు  ఆధ్వర్యంలో మంగళవారం  కోవిడ్  వాక్సినేషన్ క్యాంపును స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంపై మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ వాక్సినేషన్ అందరూ తప్పక తీసుకొని, స్వీయ నియంత్రణను పాటిస్తూ  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇదివరకు రెండవ డోసు పెండింగ్ లో ఉన్నవారికి, బూస్టర్ డోస్ అర్హత ఉన్నవారికి వాక్సినేషన్ చేశారు. ఈ అవకాశాన్ని కోర్టు సిబ్బంది, న్యాయ వాదులు, పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు.