జహీరాబాద్ లో ఈ ఎస్ ఐ హాస్పిటల్ వెంటనే ఏర్పాటు చేయాలి
జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి)జహీరాబాద్ లో ఈ ఎస్ ఐ హాస్పిటల్ వెంటనే ఏర్పాటు చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలి కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.బుధవారం వారు మాట్లాడుతూ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం కోసం హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని, జహీరాబాద్ లో ఈ ఎస్ ఐ హాస్పిటల్ లేకపోవడంతో పెద్ద ఎత్తున కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, నెలకు లక్షల రూపాయలు ఈ ఎస్ ఐ బోర్డ్ కు వెళుతున్న పట్టించుకునే నాధుడు లేడని, సి ఐ టియూ జహీరాబాద్ పరిశ్రమిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటే కనీసం మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. జహీరాబాద్ లో పూర్తి స్థాయి వైద్యం అందక పోవడం దారుణమన్నారు. ఇరవై ఐదు పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా సిఐటియు ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, నాయకులు కనక రెడ్డి, వీరయ్య గౌడ్, శ్రీకాంత్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.