జాతీయ జెండాలు అగౌరవపరిస్తే చట్టరీత్యా చర్యలు: ఎస్సై శ్రీధర్
హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 28(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణ,పరిసర గ్రామాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగిసిన సందర్భంగా వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటి పైన ఏర్పాటుచేసిన జాతీయ జెండాలను ప్రతి ఒక్కరు తీసి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలనీ ఎస్సై సజ్జనపు శ్రీధర్ సూచించారు.జాతీయ జెండాలను ఇంటి పై నుండి తీసిన తర్వాత అగౌరవపరిచే విధంగా ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని వెల్లడించారు. జాతీయ జెండాలను అగౌరవపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు