జాతీయ రహదరి నిర్మాణంలో మార్పులు

నిరసనగా అశ్వరావుపేటలో బంద్‌

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): రహదారి నిర్మాణ పనుల్లో దారి మార్చడంపై అశ్వారావుపేట వాసులు ఆందోలనకు దిగారు. ఇందుకు నిరసనగా బంద్‌ పాటించారు. సూర్యాపేట నుంచి దేవరాపల్లి జాతీయ రహదారి నిర్మాణం ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారి సత్తుపల్లి దమ్మపేట అశ్వారావుపేట మండలాల విూదుగా వేయాల్సి ఉండగా, భూసేకరణ కూడా చేశారు. అయితే ఇప్పుడు దారి మార్చి సత్తుపల్లి శివారునుండి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కోయల్లగూడెం వరకు హైవే నిర్మాణం చేస్తున్నారు. దీనికి నిరసనగా శుక్రవారం అశ్వారావుపేట మండల బందు చేపట్టారు. హైవే దమ్మపేట అశ్వారావుపేట జీలుగుమిల్లి విూదుగా వేయకపోతే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు ఆలపాటి రాము బండి పుల్లారావు అంకత మల్లికార్జురావు ప్రభాకర్‌ డేగల రాము పాల్గోన్నారు.