జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి.

కళాశాల ప్రిన్సిపాల్  కమర్ షాజహాన్ సుల్తాన.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్ 25(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లి కొండ ప్రభుత్వ డిగ్రీ & పిజి సైన్స్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్  కమర్ షాజహాన్ సుల్తాన తెలిపారు.ప్రముఖ కంపెని  హెటిరో ల్యాబ్స్ వారు ఈనెల 29వ తేది బుధవారం రోజు ఉదయం 10 గంటల నుండి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ , ఎనలిటికల్ కెమిస్ట్రీ ఇంటిగ్రెటెడ్ కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ కి సంబందించి అర్హత కలిగిన వారు విద్యార్హత పత్రాలతో కళాశాలలో హాజరుకావాలని సూచించారు.ఇట్టి అవకాశాన్ని జిల్లా లోని సంబందిత ఉద్యోగాలకు సంబందించిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8985747301 నంబర్ ను సంప్రదించాలన్నారు.