జాయింట్ కలెక్టర్ కు ఘన సన్మానం
మేడ్చల్(జనంసాక్షి): తెలంగాణ రుబాయిలు అనే విశిష్ట గ్రంథానికి తెలంగాణ సారస్వత పరిషత్తు నుండి ఉత్తమ పురస్కారం పొందిన రచయిత& జాయింట్ కలెక్టర్ శ్రీ ఏనుగు నర్సింహా రెడ్డి కి ట్రెసా మేడ్చల్ జిల్లా కమిటీ తరపున బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు కలెక్టరేట్ లో సన్మానం చేయనయినది.ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ హరీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు .అడిషనల్ కలెక్టర్ (ఎల్.బి) జాన్ శాంసన్ , డీఆర్వో లింగ్యా నాయక్,ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ , లా ఆఫీసర్ చంద్రావతి, మల్కాజ్ గిరి ఆర్డీవో మల్లయ్య , కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్ రావు,ట్రేసా జిల్లా అధ్యక్షుడు సుధాకర్,సెక్రెటరీ రామక్రిష్ణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగమణి, వాణి రెడ్డి, ఈ కార్యక్రమానికి జిల్లా ట్రెసా కార్యవర్గ సభ్యులు,తహసీల్దార్లు , అధికారులు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.