జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆకస్మిక తనిఖీ

మక్తల్ మండలంలోని గుడిగండ్ల, జక్లేర్, నర్సిరెడ్డిపల్లి, కాచ్వార్, మద్వార్ మరియు లింగంపల్లి గ్రామాలలో 8 వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డుకు ఇరువైపులా నాటుతున్న మొక్కలను డిఆర్డిఓ గోపాల్ నాయక్ పరిశీలించి కూలీలకు అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు. మక్తల్ మండలానికి మూడు లక్షల 75 వేల మొక్కలు నాటుటకు టార్గెట్ నిర్దేశించినందున అట్టి టార్గెట్ కనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, ఎంపిఓ పావని, ఏపీవో గౌరీశంకర్, ఇసి మన్యం, టి ఎ లు యాదవరెడ్డి, మహేశ్వరీ, శైలజ, పంచాయతీ కార్యదర్శులు సుమన్, భాస్కర్, రవికుమార్ లు ఉన్నారు