జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘము యువజన కార్యదర్శిగా శేఖర్

మల్దకల్ అక్టోబర్16(జనం సాక్షి)గద్వాల పట్టణంలోని రెండవ రైల్వేగెట్,తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల కమిటీ హాల్ నందు ఆదివారం తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల జిల్లా సంఘము యువజన అధ్యక్షులు అడ్వాకేట్ పాండు ఆధ్వర్యంలో తెలుగు ముదిరాజ్ మత్స్యకారు సంఘం జిల్లా యువజన కార్యదర్శిగా ఎస్ ఎస్ శేఖర్, ముదిరాజ్ జిల్లా యువజన కార్యవర్గ సభ్యులుగా జి శివ ముదిరాజ్ ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిలుగా తెలుగు ముదిరాజ్ మత్స్యకార సంఘము జిల్లా అధ్యక్షులు కబీర్ దాస్ నర్శింహులు,జిల్లా ప్రధానకార్యదర్శి జనార్ధన్, తాలూకా అద్యక్షులు జగదీష్, యువజన జిల్లా అధ్యక్షులు అడ్వాకేట్ పాండు, జిల్లా ఉపాధ్యక్షులు వంట శ్రీను యువత అద్యక్షులు చిరు ముదిరాజ్, జిల్లా సెక్రటరీ చెనుగొనిపల్లి అంజి,జాయింట్ సెక్రెటరీ కొత్తపల్లి అంజి,గద్వాల టౌన్ ప్రధానకార్యదర్శి డబ్బులెటి నర్శింహులు,అగ్రరంము కేకే, ర్యాలంపాడు నర్శింహులు,నర్శింహులు తదితరులు పాల్గొన్నారు.