జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలను ఘనంగా నిర్వహించారు

గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 2 (జనం సాక్షి);
జోగుళాoబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఆదివారము జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతిని, స్వతంత్ర సమర యోధుడు భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 118వ జయంతిలను జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్ శివ కుమార్ వారి చిత్ర పటాలకు పూలమాల తో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీపిత మహాత్మాగాంధీ తన సిద్ధాంతాలైన సత్యం,అహింస తో దేనినైనా సాధించవచ్చు అని నమ్మిన వ్యక్తి అని,సత్యాన్ని,అహింస ను పాటించడం లో ప్రపంచ మానవాళికి అదర్శoగా నిలిచారని అన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటం లో అతివాదులను,మిత వాదులను ఏకతాటిపైకి తీసుకువచ్చి భారత స్వాతంత్ర్య పోరాటం లో విజయం సాధించారని,
సమాజం లో జరిగే రుగ్మతలకు వెంటనే స్పందించేవారని, తను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే వారని అన్నారు.సహాయ నిరాకరణ ఉద్యమం,విదేశీ వస్త్ర బహిష్కరణ,ఉప్పు సత్యాగ్రహం,క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఉద్యమాలను అహింస మార్గం లో నడిపించారని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి అని,మద్యపానం మాదకద్రవ్యాలు లేని భారతాన్ని చూడాలని ఆయన ఆశ,ఆడవాళ్ళు కూడా అర్ధరాత్రి ఒంటరిగా స్వేచ్ఛగా తిరిగెంత స్వాతంత్రం కావాలని ఆశించారు అని ఆయన ఆశయాలని సాధించే దిశలో మనమందరం శ్రేమించాలని అన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి గురించి మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదానిచ్చి దేశానికి సైనికుల, రైతుల గొప్పదనాన్ని తెలియజేసిన వ్యక్తి అని, భారత రెండవ ప్రధానిగా చక్కటి పారదర్శకమైన పాలన అందించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి,ఐటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.