జీవిత బీమాపై అవగాహన కార్యక్రమం….
ఏపీజీవీబీ మేనేజర్ కొమ్ము రమేష్ బాబు…
చిలప్ చేడ్/24ఆగస్టు/జనంసాక్షి :- జీవిత బీమా చేసుకోవడం వల్ల మరణానంతరం కూడా తన కుటుంబానికి అండగా ఉంటుందని చిట్కుల్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ కొమ్ము రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా చిలిపి చెడు మండలం టోప్య నాయక్ తండ లో ఇన్సూరెన్స్ చేసుకొని మరణించిన రత్ల సర్వన్ నామినీ అయిన అతని భార్య రాత్ల రామ్కీ బాయ్ కి రెండు లక్షల రూపాయల చెక్కును ఆయన అందించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైందని, ప్రమాదం ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో తెలియదు గనుక ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అండగా ఉండడానికి ఇన్సూరెన్స్ చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వయసు వారికి వివిధ రకాలైన ఇన్సూరెన్స్ సదుపాయాలు బ్యాంకు నందు కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. గతంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరు సంవత్సరం లోపు కచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలని కోరారు. కొత్త రుణాలు కావాలనుకునేవారు, జీరో బ్యాంక్ ఖాతా అవసరమున్నవారు బ్యాంకు బ్రాంచీలో సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్ని భాయి బిలియన్ నాయక్ తండ సర్పంచ్ రాకేష్ బ్యాంకు మేనేజర్ రమేష్ బాబు, క్యాషియర్ హరీష్, సిబ్బంది వసంత, అశోక్, మొగులయ్య, వార్డు మెంబర్లు, నాయకులు, తాండా ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.