జోగులాంబ అమ్మవారి హుండీ లెక్కింపు పూర్తి

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 15)శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయము నందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహాయ కమీషనర్ జి. శ్రీనివాస రాజు పర్యవేక్షణలో శనివారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపు నందు 205 రోజులకు సంబందించి శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.71,25,028-00,
శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి హుండీ ద్వారా రూ.15,08,352-00,
అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.75,341-00, మొత్తం కలిపి రూ.87,08,721-00
ఆదాయం వచ్చినది.
ఈ కార్యక్రమము నందు ఆలయ ఈ.ఓ. పురెందర్ కుమార్, చైర్మన్ బి. శ్రీనివాస రెడ్డి, ధర్మకర్తలు మద్దిలేటి, హరిబాబు, కుర్వ దొడ్ల రాముడు, చిన్ని కృష్ణయ్య, ముఖ్య అర్చకులు డి. ఆనంద్ శర్మ, అర్చకులు, సిబ్బంది, మరియు మునిసిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్, కమీషనర్ నిత్యానందం, అలంపూర్ ఆర్య వైశ్య మహిళలు, చీరాల, శ్రీ భ్రమరాంబికా సేవా సమితి మహిళా సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.