జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ సువర్ణ

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 12) మహా శక్తి పీఠాలలో ఒకటైన, దక్షిణకాశీగా పిలవబడే జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను, నూతనంగా అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదవి స్వీకరించిన, పాలకుర్తి సువర్ణమ్మ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఉభయ ఆలయాల్లో ప్రత్యేకపూజలునిర్వహించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట ఉత్తనూరు సర్పంచ్ సుదర్శనామ్మ,గుడి దొడ్డి సర్పంచ్ హనుమంత్ రెడ్డి, యాపాదిన్నె టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, గాండ్ల విజయ్, యుగంధర్ రెడ్డి, పెద్ద నర్సింహులు తదితర టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.