టిఆర్ఎస్ కార్యకర్తలను హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా జరుగుతున్న తాత్కాలిక టిఆర్ఎస్ కార్యకర్తలు ఆడుతున్న నాటకాలను వంగూరు మండల టిఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలిపారు. అదేవిధంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉండే ఈ నాయకులు గతంలో రేవంత్ అన్నను రంగాపూర్ గ్రామానికి ఆహ్వానించి గొప్ప గొప్పగా పొగిడిన విషయo మరిచిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నను వాడు ముఖ్యమంత్రి కాలేడు అని మాట్లాడుతున్నారు. ఈ సిగ్గులేని నాయకులు నిజమైన టిఆర్ఎస్ కార్యకర్తలు అయితే పట్టిన కాంట్రాక్టు పనులకు ఇంతవరకు బిల్లులు రాకపోవడం ఎంతో సిగ్గుచేటు అని వారు సూచించారు. అందులో ఇప్పుడు కొత్తగా టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి 70 లక్షల కాంట్రాక్ట్ పనులు ఇస్తామని మాయ మాటలు చెప్పి మరోసారి మోసం చేద్దామని ప్రయత్నిస్తున్నారు.రంగాపూర్ గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరినట్లు అబద్ధాలు చెప్పి వారి పార్టీ కండువాలు వారికే కప్పి సిగ్గు లేకుండా ఇతర పార్టీల వారు చేరినట్టు మాయ మాటలు చెప్పి ఎన్నిసార్లు ప్రజలు మోసం చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. అదేవిధంగా మేము ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులము అని మేము ఏది చెప్తే అదే వేదమని ప్రజలని బెదిరిస్తున్నారు. వారిపై కేసులు పెట్టి, మద్యం తాపీ వారిపైన లేని సమస్యలు పెద్దగా చేసి కొందరు సిపిఎం పార్టీలో ఉన్న వారిని కూడా బెదిరించి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అయినా ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏఒక్క అభివృద్ధి పనులు కూడా చేయని నాయకులు ఎమ్మెల్యే ను అడ్డం పెట్టుకొని ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ నల్లమలలో దోచుకున్న డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్న ఇలాంటి నాయకులతో జాగ్రత్త అని హెచ్చరించారు. మరియు రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న ఆ నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.