టిఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు

నారాయణఖేడ్ ఆగస్టు8(జనంసాక్షి)
 నారాయణఖేడ్ మండలం జూకల్ గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు 50 మంది  పిసిసి ఉపాధ్యక్షులు సురేష్ సేట్కార్ సమక్షంలో నారాయణఖేడ్ తన స్వగృహంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.ఈసందర్భంగా మాట్లాడుతూ  టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఎలాంటి అభివృద్ధి  జరగలేదని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి  అభివృద్ధి జరిగిందన్నారు.కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని అందుకోసమే తెరాస నుండి నాలుగు కుటుంబాలు కాంగ్రెస్ లో చేరుతున్నామన్నారు.
 ఈ కార్యక్రమంలో ఊజున్ పాడ్ మల్లప్ప,
 సర్పంచ్ లింగాపురం సంగమ, వినయ్, కంపల్లి అంజయ్య, కోటప్పల  రవీంద్ర పటేల్,లంబాడి రవి, ఇ యదుల్, పి ఈరప్ప తదితరులున్నారు.