టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభాకర్ గుప్తా మాతృమూర్తి చిత్రపటానికి మాలవేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.

మర్పల్లి ఆగస్టు 28 (జనం సాక్షి) టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పిఏ సిఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా తల్లి ప్రమీలాదేవి అన ఆరోగ్యంతో ఇటీవల మృతిచెందారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి తో కలిసి ఆదివారం మర్పల్లి గ్రామంలోని ప్రమీల దేవి ఇంటికి వెళ్లి చిత్రపటానికి మాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ వెంట ఎంపీపీ లలిత రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేశ్వర్, సొసైటీ వైస్ చైర్మన్ పసియుద్దీన్, సురేష్, మార్కెట్ కమిటీ డైరక్టర్లు రవి, అనంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి, చుక్కరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు సురేష్ కుమార్, సర్పంచు ధరమ్ సింగ్, నాయకులు బట్టు రమేష్, శంకర్, ఉగ్గెల్లి రవీందర్ రెడ్డి, రతన్, సుధాకర్, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంజిరెడ్డి, రవి వర్మ, అనంత్ రెడ్డి, ప్రమోద్, కర్నె రాజు, యాదవ్ రెడ్డి, పాండు రంగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..