టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

 ప్రతి డివిజన్ నుంచి భారీగా తరలిరావాలి.
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్.
సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 22:(జనం సాక్షి): ఈనెల 27న జరగానున్న రాష్ట్ర టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్.పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఆదర్శ్ జేమ్యాక్స్ కాలనీలోని జిల్లా ఫెడరేషన్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తదనంతరం  సమావేశంలో మహాసభలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జిల్లా సభ్యులతో కలసి విడుదల చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల నాలుగో తేదీన జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని రెండోసారి తనను అధ్యక్షంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 27వ తేదీన ఆర్టీసీ కళ్యాణ వేదిక బాగ్ లింగంపల్లి వద్ద జరిగే టీడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని ఈ మహాసభకు ప్రతి డివిజన్ నుండి భారీగా విలేకరులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి విలేఖరికి అక్రిడేషన్ కార్డు ఆరోగ్య బీమా సొంత ఇల్లు ఉండాలని లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పాటుపడుతుంది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సీలంకోటి సురేందర్. కోశాధికారి సిహెచ్. నర్సింహారెడ్డి. ఉపాధ్యక్షులు బసవేశ్వర్.  సంయుక్త కార్యదర్శులు శరత్ బాబు. కమిటీ సభ్యులు బాలరాజు. యాదగిరి. షౌకత్ అలీ. కిరణ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాండు. తదితరులు పాల్గొన్నారు.