ట్రాక్టర్ డ్రైవర్ గా మహిళా పంచాయతీ కార్యదర్శి

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 08 రాయికోడ్   మండల పరిధిలోని  శంషోద్దీన్ పూర్ గ్రామంలో హరిత హారంలో భాగంగా  మొక్కలు నాటడానికి  రోడ్డుకు ఇరువైపులా  గుంతలు తీసి సిద్ధంగా ఉన్నాయి  వాటిని నాటేందుకు కూలీలు సైతం సిద్ధంగా ఉన్నారు  .అక్కడకు మొక్కలు తీసుకెళ్లేందుకు  పంచాయితీ ట్రాక్టర్లో  ముక్కలు వేసి సిద్ధం చేశారు  కానీ  ఎంతసేపు వేచి చూసిన  ట్రాక్టర్ డ్రైవర్ రాలేదు .దీంతో  అక్కడున్న    మహిళ  పంచాయతీ కార్యదర్శి  ప్రియాంక చౌహాన్ స్వయంగా  తానే ట్రాక్టర్ నడుపుతూ  రోడ్డు ప్రక్కన మొక్కలను సరఫరా చేసింది .కార్యదర్శి  ప్రియాంక చౌహాన్  ట్రాక్టర్ నడపడంతో  అక్కడున్న వారంతా  ఆశ్చర్యానికి గురయ్యారు  .ఈ సంఘటన  సంగారెడ్డి జిల్లా  రాయికోడ్ మండల పరిధిలోని శంషోద్దీన్ పూర్  గ్రామంలో జరిగింది .