డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పరిశీలన: తహశీల్దార్ సుజాత .

మండల పరిధిలోని కోనాపూర్, దౌల్తాబాద్, ముబారస్పూర్, గొడుగుపల్లి గ్రామాల్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తహశీల్దార్ సుజాత పరిశీలించారు.అనంతరం మట్లాడుతూ దాదాపు అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తొంభై శాతం ఇండ్ల నిర్మాణం పూర్తయిందని పది శాతం ఇళ్ల నిర్మాణం పనులు పెండింగ్లో ఉన్నాయని నిర్ణీత సమయం నాటికి నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.