డబుల్ రోడ్ల నిర్మాణం కోసం మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 19 (జనం సాక్షి)

హైదరాబాద్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కలిసి దేవరకద్ర నియోజకవర్గంలోని పలు రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడం తో పాటు పలుచోట్ల బ్రిడ్జిలను నిర్మించేందుకు మంజూరు ఇవ్వాలని కోరారు .
నూతనంగా ఏర్పాటు చేసిన కౌకుంట్ల మండల కేంద్రము నుంచి అడ్డాకుల వరకు వయా పెద్ద మునుగుచెడ్ , ఇశ్రంపల్లి హైవే వరకు డబుల్ రోడ్ , బ్రిడ్జి నిర్మాణానికి , భూత్పూర్ మండలం నుంచి వయా లంబడికుంట తాండ, కర్వెన , కురుమూర్తి రాయి రిజర్వాయర్ వరకు డబుల్ రోడ్డు ను మంజూరు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కోరినట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు . మంత్రి తమ విన్నపాన్ని ఆలకించి సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఈ పనులకు మంజూరి ఇవ్వన్నట్లు మంత్రి చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు