డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు జులై (జనం సాక్షి)
దివంగత రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం నాడు పటాన్చెరు పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో గల ఆయన కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కళాశాల విద్యార్థులకు సొంత నిధులతో కొనుగోలు చేసిన నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Attachments area