డివైడర్ ను ఢీ కొట్టిన కారు:ఇద్దరు మృతి..

నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హర్షిత్, ప్రసాద్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.