ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన
న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జనంసాక్షి): వరుస అగ్నిప్రమాదాలతో దేశరాజధాని ఢిల్లీ ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మూడు రోజుల క్రితం కరోల్ బాగ్లోని ¬టల్ అర్పిత్ ప్యాలెస్లో అగ్నిప్రమాదం జరిగి 17మంది మృతి చెందిన విషయం విదితమే. అదేవిధంగా బుధవారం మరో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటంతో పలువురికి గాయాలయ్యాయి. కాగా గురువారం కూడా మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఢిల్లీ వాసులు భయాందోళన చెందుతున్నారు. పశ్చిమ ఢిల్లీలోని నరైనా ప్రాంతంలో గల ఓ కాగిత పరిశ్రమలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది. 23అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదం కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఢిల్లీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.