ఢిల్లీలో ‘విమెన్‌ డిగ్నిటీ మార్చ్‌’

న్యూఢిల్లీ : మహిళల హక్కులు, భద్రత కోరుతూ నేడు వందలాది జనం ఢిల్లీలో విమెన్‌ డిగ్నిట్‌ మార్చ్‌ నిర్వహించారు. ప్రగతిమైదాన్‌నుంచి బయల్దేరిన ఈ మార్చ్‌ ఇండియా గేట్‌ పక్కనుంచీ రాజ్‌ఘాట్‌ చేరింది.  రాజ్‌ఘాట్‌ వద్ద ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షత్‌ వారికి నాయకత్వం వహించి మహాత్మాగాంధీకి నివాళుల్పరించారు. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర మహిళా కమిషన్‌ కలిసి ఈ మార్చ్‌ను నిర్వహించాయి.