ఢిల్లీ అత్యాచారం ఘటనలో నేడు కొనసాగనున్న విచారణ
న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది.ఈ కేసులో అభియోగాలు నమోదైన ఐదుగురి నిందితులపై కోర్టు విచారణ చేపట్టనుంది. గత వారం బాధితురాలి స్నేహితుడుతో పాటు పలువురి సాక్ష్యాలను కోర్టు నమోదు చేసింది. ఈ ఘటనలో ఆరో నిందితున్ని బాల నేరస్థుల కోర్టు మైనర్గా తేల్చడంతో అతని విచారణ విడిగా చేపట్టనున్నారు. గత డిసెంబర్లో దక్షిణ ఢిల్లీలో వైద్యవిద్యార్థినిపై బస్సులో దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం వాహనం నుంచి తోసివేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిప బాధితురాలు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.