తండ్రి తాగుడుకు విసుగెత్తిన బాలుడు

ఉరేసుకుని ఆత్మహత్య

ఖమ్మం,జూన్‌5(జనం సాక్షి): మధిర నగరపంచాయితీ పరిధి మడుపల్లిలో దారుణం జరిగింది. 10వ తరగతి చదివే విద్యార్ది నీలం శివకృష్ణ(15) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో కలకలం రేపింది. కేవలం తండ్రి తాగుడికి బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడుతుండతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల ఆరోపించారు. బాలుడి మనసు గాయమైందని, తండ్రిని నిలువరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన కుటుంబంలో విషాదం నింపింది.