తడ్కల్ ను మండలం గా ప్రకటించాలి నారాయణఖేడ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె శ్రీనివాస్
నారాయణఖేడ్ జులై28(జనంసాక్షి)
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల తడ్కల్ ను మండలం గా ప్రకటించాలి అని గత కొన్ని రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తూ ప్రతాప్ రెడ్డి సర్పంచ్, నవంత్, నగ్నత్,జ్ఞానేస్ జనార్దన్ పాటిల్,రాజు ,రామప్ప,జైపాల్,శ్రీకాంత్,శ్రీను అయా గ్రామాల ప్రజలకు సంఘీభావం తెలిపారు.
ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ తడ్కల్ ను మండల కేంద్రం గా ప్రకటించేవరకు ఉద్యమం ఆగదు అని ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం ఎస్.సి సెల్ అధ్యక్షులు సాయిలు , బ్రహ్మానంద రెడ్డి, మారుతీరావు పటేల్ కొండల్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.