తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ట్‌ లలిత్‌

తదుపరి సిజె పేరును కేంద్రానికి సూచించిన జస్టిస్‌ రమణ
26న పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ రమణ

న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు తర్వాతి సీజేఐగా జస్టిల్‌ లలిత్‌ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కేంద్రానికి సిఫార్సు చేశారు. ఈ నెల 26న జస్టిస్‌ రమణ పదవీ విరమణ చేయ నుండగా.. మరుసటి రోజున అంటే 27న 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లలిత్‌ బాధ్యతలు చేపడ తారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వీ రమణ. దీనిపై బుధవారం కేంద్ర న్యాయశాఖ కార్యాలయం నుంచి సీజేఐ జస్టిస్‌ రమణ కార్యాలయానికి వర్తమానం అందింది. తర్వాతి సీజేఐని సూచించాలని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ లలిత్‌ పేరును జస్టిస్‌ రమణ సిఫార్సు చేశారు. కేంద్రం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి, ఆమోద పత్రంపై సంతకం చేస్తే భారత సుప్రీంకోర్టు 49వ సీజేగా లలిత్‌ పదవీ పగ్గాలు చేపడతారు. దేశంలో సంచలనం సృష్టించిన అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఉన్నారు. 1957 నవంబర్‌ 9 న జన్మించిన లలిత్‌… జూన్‌ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 వరకు ముంబయి హైకోర్టులో లలిత్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఆ తర్వాత జనవరి 1986నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. 2014 ఆగస్టు 13న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్‌ లలిత్‌ భారత ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులైతే.. బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు బెంచ్‌కి ఎలివేషన్‌ పొందిన రెండో సీజేఐ అవుతారు. ఇక, 1971 జనవరిలో 13వ సిజెఐగా నియమితులైన జస్టిస్‌ ఎస్‌ఎం సిక్రీ ఈ కోవలో మొదటి వారు. ఇక, జస్టిస్‌ లలిత్‌ తండ్రి జస్టిస్‌ యూఆర్‌ లలిత్‌ సీనియర్‌ న్యాయవాదిగా, ఢల్లీి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అంతేకాదు ట్రిపుల్‌ తలాక్‌ కు సంబంధించిన విషయంలోను, కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కుకు సంబంధించిన విషయంలోనూ జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. జస్టిస్‌ లలిత్‌తో జస్టిస్‌ రమణదేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ యు.యు.లలిత్‌ భాగస్వామి. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్‌ ఇచ్చింది.