తమకు కేటాయించిన భూమి కబ్జాకు గురవుతుందని రోడ్డుపై యాదవుల ధర్నా
రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి)
గోర్లు మేపుకోవడానికి యాదవులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తహశీల్దార్ కి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ…గతంలో ప్రభుత్వం తమ గొర్లు మేత మేయడానికి 5 ఎకరాల స్థలం కేటాయించిందని అట్టి స్థలాన్ని ఓ వ్యక్తు తన భూమిలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని తహశీల్దార్ కి చెప్పిన పట్టించుకోవడం లేదని సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపామని అన్నారు.తమ భూమిని కలుపుకోవడమే కాకుండా తమపై దాడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు.ప్రభుత్వం ఇచ్చిన భూమిని యాదవులకే కేటాయించాలని ఎవరు అట్టి స్థలాన్ని కబ్జా చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ధర్నా స్థలానికి తహసీల్దార్ చేరుకొని స్థల పరిశీలన చేసి న్యాయం చేస్తా అని చెప్పడంతో ధర్నా విరమించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో
యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.