తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– రెండు బస్సులు ఢీ.. 8మంది మృతి
– 37మందికి గాయాలు
చెన్నై, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : తమిళనాడు సేలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం-బెంగళూరు రహదారిపై మమంగం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 37 మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి సేలంకు వెళ్తున్న బస్సును సేలం నుంచి ధర్మపురికి రాంగ్‌ రూట్‌లో వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. రెండు బస్సుల్లో ఉన్న 37మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్‌ కు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు కాసేపు ఆటంకం ఏర్పడింది. ఆ మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. కాగా ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సీఎం పళనిస్వామి దిగ్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
————————————-