తహసిల్దార్ కు సమ్మె నోటీసు అందజేసిన విఆర్ఎ లు

మోత్కూరు జూలై 16 జనంసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎ లకు ఇస్తన్నటువంటి పెస్కేల్ జీఓ ను అర్హత కలిగిన విఆర్ఎ లకు ప్రమోసషన్స్ 55స. పై బడిన విఆర్ఎ వారసులకు ఉద్యోగులు నేటికి అమలు కాకపోవడము వల్ల రాష్ట్ర విఆర్ఎ జేఏసీ పిలుపు మేరకు మేము శనివారం నుండి తహసీల్దార్ కార్యాలయానికి రాకుండా గ్రామాల్లోనే విధులు నిర్వహిస్తూ ఈనెల 20 న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా 23 న కలెక్టర్ కార్యాలయము ముట్టడి 25 నుండి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేపడతామమని విఆర్ఎ లు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక తహశీల్దార్ షేక్ అహ్మద్ కు సమ్మె నోటీసు పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనరు ఆకుల సైదులు
ముక్కెర్ల రవి,మండల గౌరవ అధ్యక్షులు
సంపతయ్య,శ్రీకాంత్,మండల అధ్యక్షులు సురారం యాదయ్య,యకు,ప్రధాన కార్యదర్శి అంబటి పరశురాములు,విఆర్ఎ లు ఉమ,కిరణ్,కిషోర్,ఎల్లయ,సైదులు
శ్రీను,నూరు తదితరులు పాల్గొన్నారు.