తహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులుతహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు


టేకులపల్లి, ఫిబ్రవరి 20( జనం సాక్షి): టేకులపల్లి తహసిల్దారుగా ఇటీవల ఎల్ వీరభద్రం బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నూతన తహసీల్దార్ ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య దేవానాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా  కలసి శాలువా కప్పి బొకేను అందించి స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ తో మాట్లాడుతూ  మండల పరిధి లో గల రైతులకు ధరణి వలన జరిగిన అన్యాయని పరిస్కరించుగలరని కోరారు. ఈ కార్యక్రమం లో  మహిళా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకారపు  స్వప్న , ఇస్లావత్ నామ నాయక్, హార్జున్,ధర్మ, తదితరులు పాల్గొన్నారు.