తాండూర్ రాజీవ్ నగర్ సర్పంచ్ అధ్వర్యంలో ర్యాలీ
తాండూర్ ఆగస్టు 13 (జనంసాక్షి) తాండూర్ మండల పరిధిలోని రాజీవ్ నగర్ గ్రామపంచాయతీ లో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే సంబరాలను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఇంటిపై న జాతీయ జెండాను విధిగా ఎగురవేయాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ క్రిస్టోఫర్ ఉప సర్పంచ్ రమాదేవి ,పంచాయతీ కార్యదర్శి కల్పనా , వార్డు సభ్యులు , ఏ ఎన్ ఎం , అంగన్వాడీ, గ్రామా యువత ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు