తిగుల్ ను మండలంగా ప్రకటించాలని మంత్రికి వినతి

జగదేవ్ పూర్, జూలై  28 జనంసాక్షి:
మండలానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న  తిగుల్ గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలని  కోరుతూ గురువారం సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావును తన నివాసంలో తిగుల్ మండల సాధన సమితి సభ్యులు ,సర్పంచ్ భానుప్రకాష్ రావు, గజ్వేల్  ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎంపిటీసి మంజుల మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పిఆర్ఓకు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి తిగుల్ మండల ఏర్పాటు కోసం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్య, సభ్యులు మదుసూదన్ చారి, అశోక్, ఎల్లారెడ్డి,  శ్రీనివాస్ రెడ్డి,  నర్సింహ్మరెడ్డి, ఐలయ్య, రాజు, నవీన్, కరుణకర్ రెడ్డి, వెంకట్, కిష్టయ్య,  సీతయ్య, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.