తిమ్మప్ప స్వామి దేవాలయంలో పూజలు

 

మల్దకల్ జూలై 23 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి.నడిగడ్డ ప్రాంత భక్తులే కాక రాయచూర్, హైదరాబాద్,కర్నూల్ తదితర ప్రాంతాల భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. దేవాలయానికి వచ్చిన భక్తులకు తాటికుంట గ్రామానికి చెందిన తిమ్మయ్య శెట్టి ప్రతి శనివారం అన్నదానం చేస్తున్నారు.ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి,నాగర్ దొడ్డి సవారన్న ,చంద్రశేఖర్ రావు, పెద్దొడ్డి హన్మన్న,ఆర్యవైశ్య సంఘంనాయకులు శ్రీనివాసులు,మనసాని నాగరాజు,మద్దెలబండ నాగరాజు, గుబ్బ వెంకటేష్, ఎల్కూరు వీరయ్య వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరంఅన్నదానం ప్రారంభించారు.