తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆల‌యంలో కరోనా నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హించారు.

అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల వరకు శేష వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.