తిరుమల తిరుపతిలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వి. సతీష్ కుమార్

జనంసాక్షి /చిగురుమామిడి – ఆగష్టు 31: హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కుటుంబ సమేతంగా బుధవారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో, సస్యశ్యామలంగా, ఆయుఆరోగ్యలతో,సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు అలాగే నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి పండుగ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.