తీగుల్ ను నూతన మండలంగా ఏర్పాటు చేయాలి
-మండల సాధన సమితి సభ్యుల డిమాండ
జగదేవ్ పూర్ , జూలై 27జనం సాక్షి:
ఉమ్మడి మెదక్ జిల్లాలో చైతన్యం గల జగదేవ్ పూర్ మండలంలోని తీగుల్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని తీగుల్ మండల సాధన కమిటీ సభ్యులు సర్పంచ్ భాను ప్రకాష్ రావు, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య, ఎంపిటిసి మంజుల మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దయానంద రెడ్డి లు కోరారు. బుధవారం తీగుల్ గ్రామంలో పార్టీలకు అతీతంగా మండల సాధన కమిటీ సభ్యులు తీగుల్ ను మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి కొత్త మండలాలను ఏర్పాటు చేసినప్పుడు తీగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ తీగుల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో రెండు మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదల చేసిందన్నారు. ఈ క్రమంలో తీగుల్ కు మండలం కావలసిన అర్హత ఉందని, అన్ని రకాల భవన సదుపాయాలు ఇక్కడ ఉన్నట్లు వివరించారు. మండలం సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో పాటు డివిజన్ అధికారులకు వినతి పత్రలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ ఐలయ్య, మాజీ ఎంపిటిసి కోటయ్య, మధుసూదనా చారి, అశోక్, ఎల్లారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి, ఐలయ్య, ఎల్లయ్య, పరశురాం పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చైతన్యం గల జగదేవ్ పూర్ మండలంలోని తీగుల్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని తీగుల్ మండల సాధన కమిటీ సభ్యులు సర్పంచ్ భాను ప్రకాష్ రావు, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య, ఎంపిటిసి మంజుల మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దయానంద రెడ్డి లు కోరారు. బుధవారం తీగుల్ గ్రామంలో పార్టీలకు అతీతంగా మండల సాధన కమిటీ సభ్యులు తీగుల్ ను మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి కొత్త మండలాలను ఏర్పాటు చేసినప్పుడు తీగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ తీగుల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో రెండు మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదల చేసిందన్నారు. ఈ క్రమంలో తీగుల్ కు మండలం కావలసిన అర్హత ఉందని, అన్ని రకాల భవన సదుపాయాలు ఇక్కడ ఉన్నట్లు వివరించారు. మండలం సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో పాటు డివిజన్ అధికారులకు వినతి పత్రలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ ఐలయ్య, మాజీ ఎంపిటిసి కోటయ్య, మధుసూదనా చారి, అశోక్, ఎల్లారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి, ఐలయ్య, ఎల్లయ్య, పరశురాం పాల్గొన్నారు.