తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న, ఎమ్మెల్సీ, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి
జనంసాక్షి /మెదక్ బ్యూరో ఆగస్టు 23 హవేళిఘనపూర్ మండల పరిధిలో ఫరీద్ పూర్ గిరిజన తండాల్లో మంగళవారం జరిగిన తీజ్ ఉత్సవాలలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న సుభాష్ రెడ్డి కి గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించడం ఆంధ్ర దాయకం అన్నాడు. ప్రస్తుతం ప్రతి గిరిజన తండాల్లో దేవాలయాలు నిర్మించుకొని, అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తూ సమైక్యంగా ముందుకు పోవడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పరిధి పూర్ సర్పంచ్ వినోద్, సొసైటీ చైర్మన్ బ్రహ్మం,లింగసానిపల్లి, హవేళిఘనపూర్ సర్పంచులు చౌదరి మహిపాల్ రెడ్డి, నోముల శ్రీకాంత్ , మద్దెల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.