తూతూ మంత్రంగా సాగిన సర్వసభ్య సమావేశం
,ఝరాసంగం: ఆగస్టు 20 (జనంసాక్షి).ఝరాసంగం మండల కేంద్రంలో మండల అభివృద్ధి కార్యాలయం లో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి 19 శాఖల గాను కేవలం ఆరు శాఖల అధికారులు హాజరై మమ అనిపించారు. మిగతా 13 శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. మండల ప్రజా పరిషత్ ఎంపీపీ అధ్యక్షులు కటికే దేవదాస్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం కాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. మిగతా ఆరు శాఖల అధికారులకు ఎంపీటీసీలు ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుజాత, మండల వైద్యాధికారి మజీద్, మండల ఏ పీ ఎం బాలకృష్ణ, మండల పశువైద్యాధికారి సునీల్ దత్, మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు,పరిషత్ ఉపాధ్యక్షులు మల్లన్న పాటిల్, ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ చంద్రమ్మ వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు శంకర్ పటేల్, రాజు శంకరమ్మ, సంగీత, తదితరులు పాల్గొన్నారు.
