తూర్పు గూడెం వినాయక మండపంలో మహానదానం

టేకులపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి ): వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని టేకులపల్లి మండలంలోని తూర్పు గూడెం గ్రామంలో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మండపం సన్నిధిలో గురువారం మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో హరిప్రియ హరి సింగ్ నాయక్ యువసేన అధ్యక్షులు జాటోత్ నరేష్ నాయక్, గ్రామ పెద్దలు అంగోత్ లచ్చా నాయక్, జాటోత్ సితారం నాయక్,నాగేశ్వరావు, రవీందర్, లింగ మల్లు, చిట్టీ రాజు, శ్రీనివాస చారి, కొండ బత్తుల శ్యామ్, ధన్ను, బిక్కు, రాంచంద్ , మంగీలాల్, లింగా,దసరు,రమేష్,వెంకటేష్, యోగేష్,మోహన్, సాయి, అశోక్,వేణు, గణేష్, మహేష్, లాలు, రాజు,రాములు, హీరా లాల్, మరియుతండా,మహిళలు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.