తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి ) కేంద్ర ప్రభుత్వం పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన విధించిన జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా బుధవారం తెరాస పార్టీ ఆధ్వర్యంలో జహీరాబాద్ ఐబి గెస్ట్ హౌస్ ముందు ప్రధాన రోడ్డు పై రాస్తారోకో చేసి, కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై వేసిన జిఎస్టీ  ని వెనక్కి తీసుకోవాలని నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో  శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, పట్టణ అద్యక్షులు సయ్యద్ మొహివుద్దిన్, ఆత్మ కమిటీ ఛైర్మెన్  పెంటా రెడ్డీ, పట్టణ యువత అద్యక్షులు కళ్లెం రవీందర్, పట్టణ ఎస్సి  సెల్ అద్యక్షులు శివప్ప, పిచెరగడి సర్పంచ్ రవి కిరణ్, బర్డిపడ్ ఎంపీటీసీ శంకర్, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, ఇజ్రాయేల్ బాబీ, బండి మోహన్, గణేష్, లక్ష్మీకాంత్, ఫైయాజ్, చంద్రయ్య, జాకీర్,  సత్యం ముదిరాజ్, కోట ధనరాజ్ గౌడ్, శివరాజ్, ముదస్సీర్, ఏజస్ బాబా, జుబెర్, వెంకట్ గుప్త, రాకేష్, డేవిడ్, అభ్రహం, లవన్, కరీం, చిన్న సుకుమార్, కళ్లెం శివ నాయకులు తదితరులు ఉన్నారు.